నిజామాబాద్, వెలుగు: జిల్లాలో మాతాశిశు మరణాలు ఎట్టిపరిస్థితుల్లోనూ జరగొద్దని నిజామాబాద్కలెక్టర్ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో వైద్యారోగ్యశాఖ అధికారులతో రివ్యూ నిర్వహించి మాట్లాడారు. సర్కారు దవాఖానాల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలని, గర్భిణుల నమోదు నుంచి సుఖప్రసవం జరిగే దాకా ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్ చేయాలని ఆదేశించారు. రక్తహీనత, హైరిస్క్ పేషెంట్ల పట్ల మరింత అలర్ట్గా ఉండాలన్నారు. ఐసీడీఎస్, మెడికల్ స్టాఫ్కలిసి సమన్వయంతో పనిచేసి మాతాశిశు సంరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
బాల్య వివాహాలు, మేనరికపు పెళ్లిళ్ల నష్టాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్పర్సన్ డాక్టర్ కవితారెడ్డి, డీఎంహెచ్వో రాజశ్రీ తదితరులు ఉన్నారు. జక్రాన్పల్లి మండలం మునిపల్లిలోని జ్యోతిబాఫూలే బీసీ వెల్ఫేర్ గర్ల్స్రెసిడెన్షియల్ కాలేజీని కలెక్టర్తనిఖీ చేశారు.
