
హైదరాబాద్, వెలుగు:వివాదాలు లేని టీచర్ పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. ఖాళీలపై పాఠశాల విద్యాశాఖ స్పష్టతనిచ్చింది. ఇప్పటికే స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజీ పండిట్స్, పీఈటీ పోస్టుల భర్తీకి షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పది జిల్లాల పరిధిలో ఈ విభాగాల్లో విద్యా శాఖ మొత్తం 2,509 పోస్టులను నోటిఫై చేయగా.. 2,058 మంది అభ్యర్థులనే టీఎస్పీఎస్సీ ఎంపిక చేసింది. మరో 451 పోస్టులకు సరైన అభ్యర్థులు దొరకలేదని అధికారులు చెప్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కువగా 442 పోస్టులను విద్యా శాఖ గుర్తించగా, 374 మంది అభ్యర్థులను టీఎస్పీఎస్సీ ఎంపిక చేసింది. తక్కువ పోస్టులున్న ఖమ్మం జిల్లాలో 128 పోస్టులను గుర్తిస్తే,105 మంది అభ్యర్థులనే టీఎస్పీఎస్సీసెలెక్ట్ చేసింది. నల్గొండ జిల్లాలో మాత్రం 356 పోస్టులకు.. 341 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. అన్ని జిల్లాల సెలెక్టెడ్ అభ్యర్థుల వివరాలను బుధవారం వెబ్సైట్లో పెట్టగా.. గురువారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొనసాగింది. ఈ నెల 13,14 తేదీల్లో అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి, పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వనున్నారు.
జిల్లాల వారిగా భర్తీ చేసే పోస్టుల వివరాలు
జిల్లా నోటిఫై ఎంపిక ఖాళీలు
ఆదిలాబాద్ 216 149 67
హైదరాబాద్ 197 109 88
కరీంనగర్ 303 260 43
ఖమ్మం 128 105 23
మహబూబ్నగర్ 442 374 68
మెదక్ 278 210 68
నల్గొండ 356 341 15
నిజామాబాద్ 138 103 35
రంగారెడ్డి 280 251 29
వరంగల్ 171 156 15
మొత్తం 2,509 2,058 451