తిరుమలను దర్శించుకున్న కాకతీయ రాజ వారసుడు

తిరుమలను దర్శించుకున్న కాకతీయ రాజ వారసుడు

కాకతీయ రాజవంశంలో 22వ తరం వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో... కుటుంబసభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తర్వాత పండితులు వేదాశీర్వచనం అందించారు. విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని స్వామివారిని ప్రార్థించినట్టు కమల్ చంద్ర భంజ్ దేవ్ తెలిపారు.