
కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ కాకినాడ సిటీకి చెందిన 49 ఏళ్ల వ్యక్తికి, రాజమండ్రి సిటీకి చెందిన 72 ఏళ్ల వ్యక్తికి టెస్టుల్లో పాజిటివ్ అని తేలింది. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23 కు చేరింది. ఇక తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70 కి చేరింది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1173 కు చేరుకోగా..29 మంది చనిపోయారు.