- ఆటోలో తరలిస్తుండగా రంగారెడ్డి జిల్లా ఎల్వర్తిలో సీజ్
- పోలీసుల అదుపులో ముగ్గురు, పరారీలో ఇంకో ఇద్దరు
శంకర్ పల్లి, వెలుగు: నిషేధిత పత్తి విత్తనాలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రూ.6 లక్షల విలువ చేసే 240 కిలోల బీజీఐఐఐ/హెచ్టీ విత్తనాలను ఆటోలో తీసుకువస్తుండగా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని, ఇంకో ఇద్దరు పరారయ్యారని రాజేంద్రనగర్ ఎస్వోటీ, శంకర్పల్లి పోలీసులు తెలిపారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం వెలిమలకు చెందిన శివశంకర్రావు, శంకర్పల్లి మండలం ఎల్వర్తికి చెందిన శ్రీనివాస్రెడ్డి, శంకర్పల్లికి చెందిన ఉదయ్కిరణ్, హరిబాబుకు కర్నూలుకు చెందిన విత్తనాల సప్లయర్శ్రీనివాస్రావుతో కొన్నాళ్లుగా వ్యాపార సంబంధం ఉంది. తన వద్ద ప్రభుత్వం నిషేధించిన పత్తి (బీజీ-ఐఐఐ/హెచ్టీ) విత్తనాలను శ్రీనివాస్ రావు కిలోకు రూ.2,500 లెక్కన 240 కిలోలు వాళ్లకు అమ్మాడు.
అనంతరం వాటిని ఆటోలో తీసుకుని వస్తుండగా పోలీసులు బుధవారం శంకర్పల్లి మండలం ఎల్వర్తి వద్ద ఆపి తనిఖీ చేశారు. నిషేధిత పత్తి విత్తనాలు, మొబైల్ ఫోన్, రూ.2,500 నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఆటో డ్రైవర్ శివశంకర్రావు, శ్రీనివాస్రెడ్డి, ఉదయ్కిరణ్ని అదుపులోకి తీసుకోగా.. సప్లయర్ శ్రీనివాస్రావు, హరిబాబు పరారీలో ఉన్నారని, కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
