దోస్తులు లేకుండా జీవితాన్ని నెట్టుకొచ్చేస్తున్నారు మిలీనియల్స్. ఏకాకులమని వారంతా దిగులుతో, డిప్రెషన్లోకి వెళ్లిపోతున్నారు. దీంతో ఫుల్లుగా మందు కొట్టడం, డ్రగ్స్ తీసుకోవడం, చివరకు ఆత్మహత్యల దాకా వెళ్లిపోతున్నారు. అయితే, అంతకుముందు తరాలకు చెందిన బేబీ బూమర్స్, జనరేషన్–ఎక్స్ వారికి మాత్రం జీవితంలో చాలా మంది స్నేహితులు ఉన్నారట. వారికి ఒంటరితనం సమస్య చాలా తక్కువగా ఉందట. బ్రిటన్కు చెందిన ‘యూగవ్’ అనే రీసెర్చ్కంపెనీ చేసిన సర్వేలో ఈ సంగతులు వెల్లడయ్యాయి. 21వ శతాబ్దం ప్రారంభం నాటికి టీనేజ్ నుంచి యుక్త వయసులోకి వచ్చిన వారిని మిలీనియల్స్ అంటారు. అంటే.. 1980-–90 మధ్య పుట్టినవారు. 1946–1964 మధ్య పుట్టినోళ్లను బేబీ బూమర్స్ అని, 1960–1980 మధ్య పుట్టిన వారిని జనరేషన్ఎక్స్ అని అంటారు.
సర్వేలో ఏం తేలిందంటే…
25% మిలీనియల్స్కు ఒక్క ఫ్రెండ్కూడా లేరు.
జనరేషన్ ఎక్స్ వారిలో 16%, బేబీ బూమర్స్లో
9 % మందికి దోస్త్లు లేరు.
బూమర్స్కు సగటున 50 మంది దోస్త్లున్నారు.
మిలీనియల్స్లో 50 మందికి పైగా ఫ్రెండ్స్ఉన్నవారు 6% మందే
మిలీనియల్స్లో 25% మంది ఒంటరితనంతో డిప్రెషన్ బారిన పడుతున్నారు.
జనరేషన్ ఎక్స్లో 20%, బేబీ బూమర్స్లో 15% మంది ఒంటరితనంతో బాధపడుతున్నారు.
30% మంది మిలీనియల్స్ తాము ఎవరినీ బెస్ట్ఫ్రెండ్గా పరిగణించమని చెప్పారు.
జనరేషన్ఎక్స్ వారిలో 27%, బేబీ బూమర్స్లో 25% మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరూ లేరన్నారు.
