దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు ఉధృతమవుతోంది. ఇప్పటి వరకు దేశంలో 2552 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 72 మంది చనిపోగా.. 191 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో 423 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత తమిళనాడులో 309, ఢిల్లీ 293, కేరళ 286, తెలంగాణ 154, ఆంధ్రప్రదేశ్ 149, రాజస్థాన్ 140, ఉత్తరప్రదేశ్ 128, కర్ణాటక 124, మధ్యప్రదేశ్ 107 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 21 మంది కరోనాతో మరణించారు. ఆ తర్వాత తెలంగాణలో 9, మధ్యప్రదేశ్ లో 8, గుజరాత్ లో 7, పశ్చిమబెంగాల్ లో 6 మంది కరోనాతో చనిపోయారు.
see more news