దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 2552..మరణాలు 72

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 2552..మరణాలు 72

దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు ఉధృతమవుతోంది.  ఇప్పటి వరకు దేశంలో 2552 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 72 మంది చనిపోగా.. 191 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో 423 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత  తమిళనాడులో 309, ఢిల్లీ 293, కేరళ 286, తెలంగాణ 154, ఆంధ్రప్రదేశ్ 149, రాజస్థాన్ 140, ఉత్తరప్రదేశ్ 128, కర్ణాటక 124, మధ్యప్రదేశ్ 107 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 21 మంది కరోనాతో మరణించారు.  ఆ తర్వాత  తెలంగాణలో 9, మధ్యప్రదేశ్ లో 8, గుజరాత్ లో 7, పశ్చిమబెంగాల్ లో 6 మంది కరోనాతో చనిపోయారు.

see more news

మోడీ మరో సందేశం..ఆదివారం 9 నిమిషాలు ఏం చేయాలంటే.?

కరోనా మృతుల అంత్యక్రియలపై కేంద్రం గైడ్​లైన్స్