సుక్మా జిల్లాలో 26 మంది మావోయిస్టుల లొంగుబాటు

సుక్మా జిల్లాలో 26 మంది మావోయిస్టుల లొంగుబాటు

భద్రాచలం, వెలుగు: ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో బుధవారం అక్కడి ఎస్పీ కిరణ్​చౌహాన్​ సమక్షంలో 26 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఏడుగురు మహిళలు ఉన్నారు. వీరిపై రూ.64లక్షల రివార్డు ఉంది. జిల్లాలోని మార్వార్  డివిజన్​ సభ్యులు, పీపుల్స్  లిబరేషన్​ గెరిల్లా ఆర్మీ(పీఎల్​జీఏ) కమిటీ సభ్యులు లొంగిపోయిన వారిలో ఉన్నారు. 

వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం తక్షణ ఆర్థికసాయం, పునరావాసం, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎస్పీ తెలిపారు. సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడిపేలా తోడ్పాటు అందిస్తామని చెప్పారు.