శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తి వద్ద 2 కిలోల 290 గ్రాముల బంగారం లభ్యమైంది. సూట్ కేస్ రాడ్ లో బంగారం పెట్టి తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 1.2 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.