పటాన్ చెరు పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలు

పటాన్ చెరు పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలు

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. ఫిబ్రవరి 13వ తేదీ మంగళవారం రాత్రి పటాన్ చెరు పారిశ్రామిక వాడలోని పాశమైలారంలోని ఓ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. 

ఈ అగ్నిప్రమాదంలో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి.. ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స కోసం హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.

Also Read:కేసీఆర్ నల్గొండ సభలో అపశృతి.. హోంగార్డ్ మృతి