భద్రాచలం, వెలుగు : చత్తీస్గఢ్ రాష్ట్రంలోని పఖాంజూర్ జిల్లా పోలీసులు ఆదివారం ముగ్గురు మావోయిస్టులను అరెస్ట్ చేశారు. కోయలిబేడా పోలీస్స్టేషన్పరిధిలో మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్కు వెళ్లాయి. గోమే అడవుల్లో గాలిస్తుండగా ముగ్గురు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 8 కిలోల ఐఈడీ బాంబుతో పాటు వాకీటాకీ దొరికాయి. అంచాలా, పూనెం రమేశ్ అనే ఇద్దరు కీలక మావోయిస్టులతో పాటు, మరొకరిని వారికి సహాయం చేస్తున్న పూనమ్రాంగా గుర్తించారు. అంచాలా, పూనెం రమేశ్ ఒక్కొక్కరిపై రూ.8లక్షల చొప్పున రివార్డు ఉంది. అనేక హింసాత్మక ఘటనల్లో వీరు పాల్గొన్నట్లుగా రికార్డుల్లో ఉన్నాయి. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కు
తరలించారు.