చత్తీస్​గఢ్ లో ముగ్గురు మావోయిస్టుల అరెస్ట్

 చత్తీస్​గఢ్ లో  ముగ్గురు మావోయిస్టుల అరెస్ట్

భద్రాచలం, వెలుగు :  చత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని పఖాంజూర్​ జిల్లా పోలీసులు ఆదివారం ముగ్గురు మావోయిస్టులను అరెస్ట్ చేశారు. కోయలిబేడా పోలీస్​స్టేషన్​పరిధిలో మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో సీఆర్​పీఎఫ్​ బలగాలు కూంబింగ్​కు వెళ్లాయి. గోమే అడవుల్లో గాలిస్తుండగా ముగ్గురు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 8 కిలోల ఐఈడీ బాంబుతో పాటు వాకీటాకీ దొరికాయి. అంచాలా, పూనెం రమేశ్​ అనే ఇద్దరు కీలక మావోయిస్టులతో పాటు, మరొకరిని వారికి సహాయం చేస్తున్న పూనమ్​రాంగా గుర్తించారు. అంచాలా, పూనెం రమేశ్​ ఒక్కొక్కరిపై  రూ.8లక్షల చొప్పున రివార్డు ఉంది. అనేక హింసాత్మక ఘటనల్లో వీరు పాల్గొన్నట్లుగా రికార్డుల్లో ఉన్నాయి. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్​కు 
తరలించారు.