ఐఎన్ఎస్ రణ్ వీర్ నౌకలో పేలుడు.. ముగ్గురు నేవీ సిబ్బంది మృతి

ఐఎన్ఎస్ రణ్ వీర్ నౌకలో పేలుడు.. ముగ్గురు నేవీ సిబ్బంది మృతి

ముంబైలోని నావల్ డాక్ యార్డ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. డాక్ యార్డ్ లో ఉన్న ఐఎన్ఎస్ రణ్ వీర్ నౌకలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు నేవీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఇండియన్ నేవీ అధికారులు వెల్లడించారు. ఐఎన్ఎస్ రణ్ వీర్ లోని ని ఇంటర్నల్ కంపార్ట్ మెంట్ లో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఘటన జరిగి వెంటనే నౌకలోని క్రూ వేగంగా స్పందించి.. పరిస్థితులను చక్కదిద్దారని చెప్పారు.

కాగా, ఐఎన్ఎస్ రణ్ వీర్ నౌక.. క్రాస్ కోస్ట్ ఆపరేషన్స్ కోసం ఈస్ట్రన్ నేవల్ కమాండ్ నేతృత్వంలో పని చేస్తోంది. ఈస్ట్రన్ నేవల్ కమాండ్ బేస్ అయిన విశాఖపట్నానికి ఈ నౌక తిరిగి వెళ్లాల్సి ఉండగా ఈ సమయంలో ప్రమాదం జరిగిందని నేవీ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణాలను తేల్చేందుకు ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

తెలంగాణలో తొలి మహిళా వర్సిటీగా కోఠి ఉమెన్స్ కాలేజ్

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి హరీశ్ రావు లేఖ

ఇంజినీరింగ్ కాలేజీలో 100 మందికి పైగా కరోనా