వాహనంలో వెళ్తున్న జవాన్లపై ఉగ్రవాదుల దాడి..!

వాహనంలో వెళ్తున్న జవాన్లపై ఉగ్రవాదుల దాడి..!

కశ్మీర్:  పారామిలటరీ సైనికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. ఈఘటన శనివారం సాయంత్రం ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని సోపోర్‌లో జరిగింది. జవాన్లు తమ వెహికిల్ లో వెళ్తుండగా సోపూర్ చెక్ పోస్టు వద్ద వారి వాహనం ఆగింది. దీంతో వారిపై  ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఐదుగురు జవాన్లలో ముగ్గురు చనిపోగా… మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఓ పోలీసు అధికారి మీడియాతో మాట్లాడుతూ… వాహనంలో వెళ్తున్న జవాన్ల పై ఉగ్రవాదులు దగ్గరినుంచి కాల్పులు జరిపారని తెలిపారు.

గాయపడిన వారిని శ్రీనగర్‌లోని ఆర్మీ 92వ బేస్ హస్పిటల్ కు పంపించినట్లు చెప్పారు పోలీసులు. ఈ వారంలో ఇది మూడవ దాడి అని అన్నారు. శుక్రవారం   సీఆర్‌పీఎప్ బలగాలపై ఉగ్రవాదులు దాడి చేయగా ఒక జవాను గాయపడ్డాడు. అయితే జవాన్లపై దాడిచేసిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి.