పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల ఏర్పాట్లలో విషాదం చోటు చేసుకుంది. పవన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులు పెద్దఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ ఫ్లెక్సీలు కట్టే సమయంలో ముగ్గురు అభిమానులకు కరెంట్ షాక్ తో అక్కడికక్కడే మృతిచెందారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని ఏడవ మైల్ వద్ద పవన్ కల్యాణ్ అభిమానులు సోమశేఖర్, రాజేంద్ర, అరుణాచలంలు బ్యానర్లు కట్టే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలు కడుతుండగా షాక్ తగిలి అక్కడికక్కడే మరణించారు. గాయపడిన నలుగురిని కుప్పంలోని పిఈఎస్ మెడికల్ కాలేజ్కు తరలించారు.
అయితే అభిమానుల మృతిపై పవన్ కల్యాణ్ స్పందించారు. విద్యుత్ షాక్ తో దుర్మరణం పాలవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది మాటలకు అందని విషాదం. ఆ తల్లితండ్రుల గర్భ శోకాన్ని అర్థం చేసుకోగలను. దూరమైన బిడ్డలను తిరిగి తీసుకురాలేను. ఆ తల్లితండ్రులకు నేనే ఒక బిడ్డగా ఆర్థికంగా ఆ కుటుంబాలను ఆదుకొంటాను అని పవన్ కల్యాణ్ ప్రకటనలో తెలిపారు.