వయనాడ్: కొండచరియలు విరిగిపడిన ఘటనలో గల్లంతైన ఐదుగురు టన్నెల్ నిర్మాణ కార్మికుల కోసం రెస్క్యూ టీమ్స్ విస్తృతంగా గాలిస్తున్నాయి. మట్టి దిబ్బల కింద చిక్కుకుపోయిన వారిని వెలికితీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వారిని గుర్తించడానికి శిక్షణ పొందిన కుక్కలు, ఫైర్ ఫోర్స్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్బృందాలను రంగంలోకి దించామని తెలిపారు.
గాలింపు చర్యలను వేగవంతం చేసేందుకు ప్రమాద స్థలాన్ని నాలుగు జోన్లుగా విభజించామని చెప్పారు. నది దిగువ ప్రాంతాల్లోనూ గాలింపు జరుపుతూనే, చూరల్మల వైపు వెళ్లే ప్రధాన రహదారిని పునరుద్ధరించామని పేర్కొన్నారు.
