గాజాపై మరోదాడి.. 30 మంది పాలస్తీనియన్లు మృతి

గాజాపై మరోదాడి.. 30 మంది పాలస్తీనియన్లు మృతి

గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గాజాలోని ఓ నివాస భవనంపై దాడులు నిర్వహంచగా.. ఈ ఘటనలో దాదాపు 30 మంది పాలస్తీనియన్లు మరణించారు. పాలస్తీనా మీడియా ప్రకారం ఈ భవనం జబాలియా శరణార్థి శిబిరంలోని అల్-షుహదా ప్రాంతంలో ఉంది. ఈ దాడి కారణంగా భవనం నేలమట్టమైందని, ఇరుగుపొరుగు ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయని నివేదికలు తెలిపాయి.

Also Read : తండ్రి నిషిద్ధ పార్టీపై వ్యాఖ్యలు.. సద్దాం కుమార్తెకు 7ఏళ్ల జైలు

ఎన్‌క్లేవ్‌లో గత 24 గంటల్లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 117 మంది చిన్నారులు సహా 266 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అక్టోబరు 7న పాలస్తీనా గ్రూప్ హమాస్ దక్షిణ ఇజ్రాయెల్ కమ్యూనిటీలపై ఆకస్మిక దాడి తర్వాత ఇజ్రాయెల్ జరిపిన రెండు వారాల బాంబు దాడిలో దాదాపు 4,600 మంది మరణించారని గాజాలోని ఆరోగ్య అధికారులు తెలిపారు.