పాకిస్థాన్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు 

పాకిస్థాన్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు 

పెషావర్ : పాకిస్థాన్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పెషావర్లో ఓ మసీదు లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిలో 56 మంది మరణించగా.. మరో 194 మంది వరకు తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. వారందరినీ దగ్గరలోని హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. పోలీసులు దీన్ని ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్నారు. 

కిస్సా ఖవానీ మార్కెట్ ఏరియా కావడం, శుక్రవారం ప్రార్థనలకు భారీ సంఖ్యలో జనం వచ్చారు. ఆ సమయంలో బాంబు పేలుడు జరగడంతో భారీ ప్రాణనష్టం జరిగింది. తొలుత మసీదులోకి చొరబడ్డ ఇద్దరు సాయుధులు అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులపై ఫైరింగ్ జరిపారు. కాల్పుల అనంతరం వారు మసీదులోకి ప్రవేశించిన కాసేపటికే భారీ శబ్దంతో పేలుడు జరిగింది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక పోలీసు ఘటనాస్థలంలోనే మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు.  మసీదులో జరిగిన బాంబు దాడిని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. గాయపడ్డవారికి అవసరమైన చికిత్స అందించాలని ఆదేశించారు.

మరిన్ని వార్తల కోసం..

కుక్క లేనిదే ఉక్రెయిన్ వీడనన్న ఇండియన్

భారత్కు పాక్ కోర్టు డెడ్లైన్