దేశంలో కొత్తగా 32,981 కరోనా‌ కేసులు

 దేశంలో కొత్తగా 32,981 కరోనా‌ కేసులు

న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో  32,981 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 96,77,203కు చేరిందని.. ఇందులో 3,96,729 కేసులు యాక్టివ్‌ గా ఉండగా, 91,39,901 మంది బాధితులు కోలుకున్నారంది. ఇందులో ఆదివారం 39,109 మంది కరోనా నుంచి బయటపడి హాస్పిటల్ నుంచి డిశ్చార్జీ అయ్యారని చెప్పింది. ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు కరోనా వైరస్ తో 391 మంది మరణించారని తెలిపింది. దీంతో మొత్తం మరణాలు 1,40,573 మంది బాధితులు మహమ్మారి వల్ల మృతిచెందారని తెలిపింది. దేశంలో డిసెంబర్‌ 6 వరకు 14,77,87,656 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) ప్రకటించింది. ఇందులో ఆదివారం ఒకేరోజు 8,01,081 నమూనాలను పరీక్షించామని తెలిపింది.