
గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్పరిధిలో శనివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. గోపన్పల్లి తండా రోడ్డు పక్కన ఉన్న రెండు 33 కేవీ విద్యుత్స్తంభాలు రోడ్డుపైకి ఒరిగాయి. వాహనదారులు భయంభయంగా ఇటుగా ప్రయాణిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు కరెంట్సరఫరాను నిలిపివేశారు. గోపన్పల్లి, నానాక్రాంగూడ సబ్స్టేషన్స్పరిధిలో గంటల పాటు అంతరాయం ఏర్పడింది. ప్రత్యామ్నాయ విధానంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
గచ్చిబౌలి మెయిన్లేన్ నుంచి గోపన్పల్లి మీదుగా నానాక్రాంగూడ ఐటీ ఏరియాకు ఈ లైన్ద్వారానే 33 కేవీ విద్యుత్సరఫరా జరుగుతుంది. ఒరిగిన స్తంభాలను సరిచేసే పనులు కొనసాగుతున్నాయి.