ఉత్తరప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాప్తి కేసులు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే అక్కడి అలీఘర్ ముస్లిం వర్శిటీకి చెందిన ఉద్యోగులు 34 మంది కరోనా బారిన పడి ఇటీవల చనిపోయారు. ఈ విషయాన్ని యూనివర్శిటీ వైస్ చాన్సలర్ తారీఖ్ మన్సూర్ ఆదివారం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) డైరెక్టర్ జనరల్కు లేఖ రాశారు. వీరంతా కేవలం 18 రోజుల సమయంలో ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఇతర ఉద్యోగులు కాకుండా...కేవలం 16 మంది అధ్యాపకులు, 18 మంది రిటైర్డ్ అద్యాపకులు కరోనా కారణంగా మృత్యువాత పడ్డారని తెలిపారు. దీన్ని బట్టి చూస్తే ప్రత్యేమైన వేరియంట్ ఏదో AMU క్యాంపస్, పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఇదే వారు చనిపోవడానికి కారణమై ఉంటుందని అన్నారు. కరోనా వైరస్ కట్టడి చేసేందుకు ఇక్కడ అధ్యయనం ఎంతో అవసరమని అన్నారు. జీనోమ్ స్వీకెన్సింగ్స్ నిమిత్తం జవహర్లాల్ నెహ్రు మెడికల్ కాలేజ్లోని మైక్రో బయాలజీ ప్రయోగశాల నుండి న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమ్ అండ్ ఇంటిగ్రేటెడ్ బయోలజీ ల్యాబరేటరీకి శ్యాంపిల్స్కు పంపామని తెలిపారు. 15 రోజుల్లో ఇక్కడి ఆస్పత్రుల్లో 25 మంది డాక్టర్లు కూడా కరోనా బారిన పడ్డారని జవహర్లాల్ నెహ్రు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సాహిద్ అలీ సిద్ధిఖీ తెలిపారు.
కరోనాతో అలీఘర్ ముస్లిం వర్శిటీలో 34 మంది ఉద్యోగుల మృతి
- దేశం
- May 11, 2021
లేటెస్ట్
- దూరదర్శన్ లోగో వివాదం: కలర్ మార్పుతో బాధపడ్డాను: మాజీ సీఈవో
- 147 సీట్లతో అధికారంలోకి వైసీపీ.. ఒప్పుకున్న టీడీపీ.. వీడియో వైరల్..
- Harish Shankar Open Letter: మర్యాద ఇస్తూనే చోటాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హరీష్ శంకర్
- Gautam Gambhir: గంభీర్ వింత సమాధానం.. మెస్సీ, రోనాల్డో ఇష్టం లేదంటూ మరొకరి పేరు
- ఓటు వేయడం మర్చిపోకండి: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్
- మోకాళ్ల యాత్ర చేసినా కేసీఆర్ను నమ్మరు... ఎంపీ లక్ష్మణ్
- 2024 Hanumanth Jayanti Special: కోటిమొక్కుల దేవుడు కొండగట్టు అంజన్న
- ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : వికాస్ రాజ్
- ఇండోనేషియాలో భారీ అగ్ని పర్వత విస్ఫోటనాలు..సునామీ వస్తుందా?
- శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటి సంయుక్తా మీనన్…
Most Read News
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో భారీ వర్షం..
- ఐపీఎల్ టికెట్ల వివాదం.. ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత
- ఇదేం పద్దతి: హైదరాబాద్ ఐకియాకు జరిమానా.. రూ.20 వసూలు చేస్తారా..?