దేశంలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు

దేశంలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు

దేశంలో కరోనా కేసులు,మరణాలు రోజు రోజుకు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 3,49,691 పాజిటివ్  కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,69,60,172కి చేరింది. అదే విధంగా 24 గంటల్లో కరోనాతో 2,767 మంది చనిపోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,92,311కు చేరింది. నిన్న 2,17,113 మంది కరోనా నుంచి కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 1,40,85,110కి చేరింది. ప్రస్తుతం దేశంలో 26,82,751 ఆక్టివ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. అలాగే వ్యాక్సిన్ వేసుకున్న వారి సంఖ్య 14 కోట్ల 9 లక్షల 16 వేల 417 కు చేరింది.