లోయలో పడ్డ టూరిస్టు బస్సు.. 8 మంది మృతి

లోయలో పడ్డ టూరిస్టు బస్సు.. 8 మంది మృతి

తమిళనాడులో  ఘోర ప్రమాదం జరిగింది. కూనురు సమీపంలోని మరపాలెం దగ్గర  టూరిస్టు బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా 35 మందికి తీవ్రగాయాలయ్యాయి. బస్సు ఊటీ నుంచి మెట్టుపాలయం వెళ్తుండగా లోయలో పడింది. ప్రమాద సమయంలో బస్సులో 55 మంది ఉన్నారు.  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స కోసం కూనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

దాదాపు ఎనిమిది మంది మృతి చెందారని.. 35 మంది తీవ్రంగా గాయపడ్డారని కోయంబత్తూరు జోన్ డీఐజీ  శరవణ సుందర్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.