మా స్టూడెంట్లకు 100లోపు 35 ర్యాంకులు : నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు

మా స్టూడెంట్లకు 100లోపు 35 ర్యాంకులు : నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు

నారాయణ విద్యాసంస్థల వెల్లడి

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో తమ విద్యార్థులు సంచలనం సృష్టించారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు డాక్టర్ పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ తెలిపారు. స్టేట్ 6, 9వ ర్యాంకులను సాధించారని చెప్పారు. టాప్ 10లో రెండు, టాప్ 100లో 35, 500లోపు 232, వెయ్యి లోపు 453 ర్యాంకులను దక్కించుకున్నారని వెల్లడించారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. పోయినేడాదితో పోలిస్తే ర్యాంకుల సంఖ్య పెరిగిందని పేర్కొన్నారు.

ఎంసెట్ లో నిరంతరాయంగా తమ విజయప్రస్థానం కొనసాగుతోందని, తాము రూపొందించిన విద్యాప్రణాళిక ద్వారానే ఇది సాధ్యమవుతోందని తెలిపారు. ప్రతివారం ఎన్–లెర్న్ సాఫ్ట్ వేర్ ద్వారా చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ టెస్టులు, ఆన్ లైన్ మాక్ టెస్టులు, ఇంటిగ్రేటెడ్ సిలబస్, మైక్రో షెడ్యూల్, ఎక్స్ పర్ట్స్ తో రూపొందించిన స్టడీ మెటీరియల్ తమ విజయాలకు కారణమన్నారు.