తెలంగాణలో మరో మూడు పాజిటివ్..36కు చేరిన కరోనా కేసులు

తెలంగాణలో మరో మూడు పాజిటివ్..36కు చేరిన కరోనా కేసులు

తెలంగాణలో  కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. ఇవాళ ఒక్కరోజే మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  లండన్ నుంచి వచ్చిన 49 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. ఇతను రంగారెడ్డి జిల్లా కోకాపేటకు చెందిన వ్యక్తి ఇటీవల లండన్ నుంచి వచ్చారు. అలాగే చందానగర్ కు చెందిన 39 ఏళ్ల మహిళకు పాజిటివ్ వచ్చింది. ఈమె ఇటీవల జెర్మనీ నుంచి వచ్చింది. సౌదీ నుంచి బేగంపేటకు వచ్చిన  61 ఏళ్ల మహిళకు పాజిటివ్ వచ్చింది. వీరిని ఆస్పత్రికి తరలించారు. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 36 కు చేరింది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 492కు చేరగా మరణాల సంఖ్య 9 కి చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 101 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

see more news

భారత్ లో కరోనా కేసులు 492..మృతుల సంఖ్య 9

యువతకూ కరోనా వైరస్ ముప్పు ఎక్కువే