ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు శరవేగంగా కొనసాగుతోంది. బుడాపెస్ట్ నుంచి మరో విమానం ఢిల్లీకి చేరుకుంది. విమానంలో 240 మంది విద్యార్థులు ఉన్నారు. నిన్న ముంబైకి చేరుకున్నవిమానంలో 219 విద్యార్థులు ఉండగా.. ఉదయం బుకారెస్ట్ నుంచి 250 మందితో కూడిన విమానం ఢిల్లీకి వచ్చింది. ఇప్పటి వరకు మూడు విమానాల్లో మొత్తం 709 మంది స్వదేశానికి వచ్చారు. నిన్న వచ్చిన రెండు విమానాల్లో 28 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఎయిర్ పోర్టు నుంచి స్టూడెంట్స్ ను స్వస్థలాలకు పంపారు అధికారులు. కన్నవారిని చూసిన విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారందిరనీ సురక్షితంగా స్వదేశానికి తీసుకువస్తామని చెప్పారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.
Joyous homecoming!
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) February 26, 2022
Relieved & delighted to see 250 Indians safely return from Ukraine on the @airindiain flight at the Delhi Airport. Received & interacted with them along with with my colleague Sh @VMBJP Ji. Welcome back! #OperationGanga pic.twitter.com/KQ8tcHSTeo
మరిన్ని వార్తల కోసం