శంకర్ పల్లి, వెలుగు: ఫేక్ డాక్యుమెంట్లతో రూ.60 కోట్ల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న నలుగురిని శంకరపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నార్సింగి ఏసీపీ రమణగౌడ్తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కాకినాడకు చెందిన ముళ్లపూడి వీరవెంకట సత్యనారాయణరావు 2003లో తన స్నేహితులతో కలిసి శంకర్పల్లిలోని సర్వే నం.334, 335లో 5 ఎకరాల 12గుంటల కొన్నారు. ఆ భూమిని ప్రోగ్రెసివ్ ఆగ్రో సర్వీసెస్పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. తర్వాత అలాగే వదిలేశారు.
విషయం తెలుసుకున్న మచిలీపట్నం, కాకినాడకు చెందిన దేవాగుల రామవీర వెంకట వరప్రసాద్, పరశరాం పార్థసారథి, త్రినాథ్, పరశరాం విజయభగవాన్ఎలాగైనా భూమిని కాజేయాలని కుట్రపన్నారు. 2014లో ముళ్లపూడి వీర వెంకట సత్యనారాయణరావు చనిపోయాడని, అతని వారసుడు దేవాగుల వరప్రసాద్అని ఫేక్ఆధార్కార్డులు సృష్టించారు. అధికారుల సాయంతో 2024 జనవరిలో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. విషయం తెలుసుకున్న బాధితుడు శంకర్పల్లి పీఎస్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు నిందితులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.