పీటీఐ ర్యాలీలో బాంబు పేలుడు.. నలుగురు మృతి

పీటీఐ ర్యాలీలో బాంబు పేలుడు.. నలుగురు మృతి

ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కు నిరసనగా మంగళవారం పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ లో పీటీఐ కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు పీటీఐ కార్యకర్తలు సహా నలుగురు మృతిచెందారని, మరో ఏడుగురు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు.