18 రోజులు వెంటిలేటర్‌‌పై చికిత్స.. కరోనాను జయించిన నాలుగు నెలల పాప

18 రోజులు వెంటిలేటర్‌‌పై చికిత్స.. కరోనాను జయించిన నాలుగు నెలల పాప

విశాఖ: చిన్న, పెద్ద, ముసలి, ముతకా అని తేడా లేకుండా ఎవ్వర్నీ వదిలిపెట్టడం లేదు కరోనా మహమ్మారి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో నాలుగు నెలల చిన్నారికి వైరస్‌ సోకడంతో 18 రోజుల పాటు వెంటిలేటర్‌‌పై ట్రీట్‌మెంట్‌ తీసుకుని చివరకు కరోనాను జయించి అమ్మ ఒడికి చేరింది. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన గిరిజన మహిళకు కరోనా సోకింది. దీంతో ఆమె నాలుగు నెలల కూతురికి పరీక్షలు చేయగా ఆ చిన్నారికి కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. ట్రీట్‌మెంట్‌ కోసం విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌)కు తరలించగా.. డాక్టర్లు 18 రోజుల పాటు ట్రీట్‌మెంట్‌ అందించారు. 18 రోజులు వెంటిలేటర్‌‌పై ట్రీట్‌మెంట్‌ తీసుకున్న చిన్నారి చివరికి కరోనా జయించి హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అయింది. పాప ఆరోగ్యంగా ఉందని విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌‌ వినయ్‌చంద్‌ మీడియాతో చెప్పారు.