కారును ఢీకొన్నబస్సు.. నలుగురు మృతి

కారును ఢీకొన్నబస్సు.. నలుగురు మృతి

ఉత్తర ప్రదేశ్ లో ఘోర  రోడ్డు ప్రమాదం జరిగింది.  బిల్‌హౌర్ ప్రాంతంలోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేలో బస్సు, కారు  ఢీ కొన్నాయి.  ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి గాయాలయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. బస్సు బీహార్ నుండి ముజఫర్ పూర్ కు వెళ్తుండగా బస్సు అదుపు తప్పి ఢివైడర్ ను ఢీ కొట్టిన తర్వాత కారును ఢీ కొట్టింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

see more news

హైదరాబాద్ లో బ్రిడ్జిపై నుంచి పడ్డ కారు..ఒకరు మృతి

క్రికెట్ గాడ్ సచిన్ కు మరో ప్రతిష్టాత్మక అవార్డ్