తిపేశ్వర్ అభయారణ్యంలోకి తిరిగి వెళ్లిన4 పెద్దపులులు

తిపేశ్వర్ అభయారణ్యంలోకి తిరిగి వెళ్లిన4 పెద్దపులులు

ఆదిలాబాద్ జిల్లా : మహారాష్ట్రలోని తిపేశ్వర్ అభయారణ్యంలోకి 4 పెద్దపులులు తిరిగి వెళ్లిపోయాయి. గత 6 రోజులుగా భీంపూర్ మండలం గొల్లగఢ్, తాంసి-కె, గుంజాల, వడూర్, పిప్పల్ కోటి రిజర్వాయర్ సమీపంలో పులులు సంచరించాయి. మహారాష్ట్రలోని హివిరితో పాటు పెన్ గంగ నదిలో పులుల పాదముద్రలను ఫారెస్ట్ సిబ్బంది గుర్తించారు. పులులు పెన్ గంగను దాటి మహారాష్ట్రలోకి వెళ్లిపోయినట్టు ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. పులులు తిరిగి వెళ్లిపోవడంతో భీంపూర్ మండల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.