తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు

 తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు

కరోనా మహమ్మారి మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 477 మందికి కరోనా సోకింది. నిన్నటితో పోలిస్తే 43 కేసులు పెరిగాయి. అయితే మహమ్మారి బారిన పడి ఎవరూ మరణించకపోవడం కాస్త ఊరటనిస్తోంది. గత 24 గంటల్లో 279 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,960 యాక్టివ్ కేసులున్నాయి. ఈ రోజు అత్యధికంగా హైదరాబాద్ లో 258, రంగారెడ్డి జిల్లాలో 107 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 98.99 శాతం ఉండగా, మరణాల రేటు 0.51 శాతంగా ఉన్నట్లుగా వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.