ఏపీలో కొత్తగా 478 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 478 కరోనా కేసులు

అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల్లో 478 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపింది వైద్యారోగ్యశాఖ. వైరస్‌ బారినపడిన వారిలో 715 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని..  ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. దీంతో ఏపీలో ఇప్పటివరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య  8,76,814కు చేరగా.. 8,65,327 మంది కోలుకున్నారంది. మరో 4,420 మంది చికిత్స పొందుతున్నారని. వైరస్‌ ఇన్‌ ఫెక్షన్‌ కారణంగా ఇప్పటివరకు 7,067 మంది చనిపోయారని  తెలిపింది. గడిచిన 24 గంటల్లో  64,099 మందికి కొవిడ్‌-19 వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు 1,10,01,476 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది ఏపీ ఆరోగ్యశాఖ.