హైదరాబాద్, వెలుగు : గణేశ్ నవరాత్రుల ఉత్సవాలు, మండపాల వద్ద మహిళలను వేధించిన 488 మందిపై సిటీ షీ టీమ్స్ చర్యలు తీసుకున్నారు. ఖైరతాబాద్ బడా గణేశ్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్బండ్పై మహిళలు,యువతులతో అసభ్యంగా ప్రవర్తించిన పోకిరీలను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీడియో రికార్డింగ్ ఆధారాలతో కోర్టులో ప్రవేశపెట్టారు.
ఇందులో ఆటో డ్రైవర్స్, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు నిందితులుగా ఉన్నారు.122 పెటీ కేసుల్లో నిందితులకు 3 నుంచి 6 రోజుల పాటు కోర్టు జైలు శిక్ష విధించింది.111 మందికి కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించాలని ఆదేశించింది. మరో 255 కేసులు పెండింగ్లో ఉన్నట్లు విమెన్ సేఫ్టీ డీసీపీ కవిత తెలిపారు.