మహిళలను వేధించిన 488 మంది పోకిరీలు అరెస్ట్

మహిళలను వేధించిన 488 మంది పోకిరీలు అరెస్ట్

హైదరాబాద్‌‌, వెలుగు : గణేశ్ నవరాత్రుల ఉత్సవాలు, మండపాల వద్ద మహిళలను వేధించిన 488 మందిపై సిటీ షీ టీమ్స్​ చర్యలు తీసుకున్నారు.  ఖైరతాబాద్ బడా గణేశ్, ఎన్‌‌టీఆర్‌‌‌‌ మార్గ్, ట్యాంక్‌‌బండ్‌‌పై మహిళలు,యువతులతో అసభ్యంగా ప్రవర్తించిన పోకిరీలను రెడ్​హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. వీడియో రికార్డింగ్‌‌ ఆధారాలతో కోర్టులో ప్రవేశపెట్టారు. 

ఇందులో ఆటో డ్రైవర్స్‌‌, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు నిందితులుగా ఉన్నారు.122 పెటీ కేసుల్లో నిందితులకు 3 నుంచి 6 రోజుల పాటు కోర్టు జైలు శిక్ష విధించింది.111 మందికి కౌన్సిలింగ్‌‌ ఇచ్చి హెచ్చరించాలని ఆదేశించింది. మరో 255 కేసులు పెండింగ్‌‌లో ఉన్నట్లు విమెన్ సేఫ్టీ డీసీపీ కవిత తెలిపారు.