ఈ వారం మరో 5 ఐపీఓలు

ఈ వారం మరో 5 ఐపీఓలు

న్యూఢిల్లీ: ఈ వారం ఐదు కంపెనీల ఐపీఓలు ఇన్వెస్టర్ల ముందుకు రానున్నాయి. రూ.2,000 – 2,500 కోట్లు సేకరించనున్నాయి. ఈ ఐదు ఐపీఓల్లో రెండు మెయిన్‌‌‌‌ బోర్డు పబ్లిక్ ఇష్యూలు ఉన్నాయి.  


1. జూనిపర్‌‌‌‌‌‌‌‌ హోటల్స్‌‌‌‌ ఐపీఓ  ఈ నెల 21 న ఓపెనై, 23 న ముగియనుంది. ఈ కంపెనీ రూ.1,800 కోట్లు సేకరించనుంది.  ఒక్కో షేరు ధర రూ.342–360. హయత్ బ్రాండ్ కింద ఈ కంపెనీ హోటల్స్‌‌‌‌ను నిర్వహిస్తోంది.
2. హాస్పిటల్స్ చెయిన్‌‌‌‌ జీపీటీ  హెల్త్‌‌‌‌కేర్ ఐపీఓ ఈ నెల 22 న ఇన్వెస్టర్ల ముందు రానుంది. 26 న ముగియనుంది. ప్రైస్ బ్యాండ్‌‌‌‌ ఇంకా ప్రకటించలేదు.
3. ఫార్మా కంపెనీ జెనిత్ డ్రగ్స్ షేర్లు ఐపీఓలో రూ.75–79 రేంజ్‌‌‌‌లో అందుబాటులో ఉంటాయి. ఈ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 19 న ఓపెనై, 22 న ముగుస్తుంది. 
4. డీమ్‌‌‌‌రోల్ టెక్ ఐపీఓ ఈ నెల 20 న ఓపెనై, 22 న ముగియనుంది. స్టీల్ అల్లాయ్ రోల్స్ తయారు చేసే ఈ కంపెనీ ఐపీఓ ద్వారా రూ.29.26 కోట్లు సేకరించాలని చూస్తోంది. ఒక్కో షేరు ధర రూ.129.
5. సధవ్‌‌‌‌ షిప్పింగ్‌‌‌‌ ఐపీఓ ఈ నెల 23 న ఓపెనై, 27 న ముగియనుంది. ఐపీఓలో ఒక్కో షేరు రూ.95 దగ్గర అందుబాటులో ఉంటుంది. 
6. విభోర్‌‌‌‌‌‌‌‌ స్టీల్‌‌‌‌ ట్యూబ్స్‌‌‌‌, వైజ్‌‌‌‌ ట్రావెల్ ​ఇండియా, ఎస్కోనెట్‌‌‌‌  టెక్నాలజీస్‌‌‌‌, అట్మాస్ట్కో, థాయ్‌‌‌‌ కాస్టింగ్‌‌‌‌, కలహ్రిధాన్‌‌‌‌ ట్రెండ్జ్‌‌‌‌ కంపెనీల షేర్లు ఈ వారం మార్కెట్‌‌‌‌లో లిస్టింగ్ కానున్నాయి.