రైల్వే ట్రాక్ అభివృద్ధి, మరమ్మతుల పనుల కారణంగా విజయవాడ డివిజన్లోని పలు రైలు సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. ట్రాఫిక్ కం పవర్బ్లాక్, విజయవాడ – గుణదల మధ్య మూడో లైన్ ప్రారంభం, ప్రీ ఇంటర్లాకింగ్, ఇంటర్లాకింగ్ పనుల కారణంగా విజయవాడ నుంచి విశాఖపట్నానికి, ఇతర మార్గాల్లో నడిచే ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్, స్పెషల్ ట్రైన్స్తో సహా మొత్తం 52 రైళ్లు క్యాన్సల్ అయినట్లు వారు వివరించారు.
ఆగస్టు 23 నుంచి 29, 30 తేదీల వరకు ఆయా మార్గాల్లో ట్రైన్స్అందుబాటులో ఉండవని చెప్పారు. తిరుమల ఎక్స్ప్రెస్, గరీబ్రథ్ ఎక్స్ప్రెస్, కటక్– హైదరాబాద్ స్పెషల్ ఎక్స్ప్రెస్, జన్మభూమి ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్– విశాఖపట్నం ఏసీ ఎక్స్ప్రెస్, డబుల్డెక్కర్, ఉదయ్ఎక్స్ప్రెస్, తిరుపతి స్పెషల్, రత్నాచల్, సింహాద్రి రద్దైన ట్రైన్స్లిస్టులో ఉన్నాయి.
విజయవాడ రూట్లో క్యాన్సల్ అయిన రైళ్ల వివరాలివే.. విజయవాడ – రాజమండ్రి, విజయవాడ – కాకినాడ, కాకినాడ – లింగంపల్లి, విజయవాడ – మచిలీపట్నం, ధర్మవరం – విజయవాడ, కాకినాడ – తిరుపతితో పాటు మరికొన్ని ట్రైన్స్ క్యాన్సల్ అయిన లిస్ట్లో ఉన్నాయి. రద్దైన ట్రైన్ల వివరాల కోసం రైల్వే శాఖ అఫిషియల్ వెబ్ సైట్ ని చూడాలని అధికారులు వివరించారు.