శంషాబాద్, వెలుగు : రూల్స్కు విరుద్ధంగా రూ.34 లక్షల విలువ చేసే 526 గ్రాముల బంగారం తరలిస్తున్న మహిళ ప్రయాణికురాలిని శంషాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఎయిర్పోర్టు పోలీసులు తెలిపిన ప్రకారం.. దుబాయ్ నుంచి శంషాబాద్కు వచ్చిన విమానంలో ఒక మహిళ రూల్స్ కు విరుద్ధంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు.
మహిళను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు దాదాపు 34 లక్షల విలువ చేసే 526 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు సదరు మహిళా ప్రయాణికురాలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.