
ఏపీలో కరోనా వేగంగా ఉధృతమవుతోంది. గత 24 గంటల్లో 9858 మందికి టెస్టులు చేయగా 54 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2841 కు చేరింది. కర్నూలు జిల్లాలో ఒకరు చనిపోవడంతో కరోనా మృతుల సంఖ్య 59 కి చేరింది.1958 మంది డిశ్చార్జ్ అయ్యారు. 824 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 45 మంది డిశ్చార్జ్ అయ్యారు.