
ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఏపీలో 5487 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,81,161కి చేరింది. ఇందులో 63116 కేసులు యాక్టివ్ గా ఉంటె, 612300 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 5745కి చేరింది. ఇక జిల్లాల వారీగా.. అనంతపూర్ లో 310, చిత్తూరులో 329, తూర్పు గోదావరి జిల్లాలో 1010, గుంటూరులో 538, కడపలో 271, కర్నూలులో 113, కృష్ణా జిల్లాలో 97, నెల్లూరులో 489, ప్రకాశంలో 634, శ్రీకాకుళంలో 286, విశాఖపట్నంలో 145, విజయనగరంలో 362, పశ్చిమ గోదావరిలో 903 కరోనా కేసులు నమోదయ్యాయి