దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 5,676 కేసులు నమోదు అయినట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏప్రిల్ 10 సోమవారంతో పోలిస్తే 204 కరోనా కేసులు తగ్గాయి. తాజా కేసులతో కలిపితే దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 37,093 కి పెరిగాయి.
వైరస్ కు మరో 21 మంది బలయ్యారు. దీంతో మరణాల సంఖ్య 5,31,000 కు చేరుకుంది. మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో 220.66 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్లు అందించబడ్డాయి.