ఎస్వీ జూపార్కులో 5 తెల్లపులి పిల్లలు జన్మించాయి

ఎస్వీ జూపార్కులో 5 తెల్లపులి పిల్లలు జన్మించాయి

తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూలాజికల్(SV) పార్క్ లో ఐదు తెల్లపులి పిల్లలు జన్మించాయి. తెల్లపులులు సమీర్, రాణి ఈ ఐదు పిల్లలకు జన్మించాయని జూ అధికారులు తెలిపారు. ఇందులో మూడు మగ, రెండు ఆడ పిల్లలు ఉన్నాయి. అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి  జూను సందర్శించారు. ఇందులో భాగంగా మూడు మగ తెల్ల పులి పిల్లలకు జగన్, వాసు, సిద్ధాన్ అని.. ఆడ పులి పిల్లలకు విజయ, దుర్గగా పేరు పెట్టారు.