మహబూబ్​నగర్​ జిల్లాలో మొదటి రోజు 6 నామినేషన్లు

మహబూబ్​నగర్​ జిల్లాలో మొదటి రోజు 6 నామినేషన్లు

వెలుగు, నెట్​వర్క్: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. మొదటి రోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా6 నామినేషన్లు దాఖలయ్యాయి. మహబూబ్​నగర్​ జిల్లాలోని జడ్చర్ల,  దేవరకద్ర, మహబూబ్​నగర్​ నియోజకవర్గాలు ఉండగా, మహబూబ్​నగర్​ అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్​ అభ్యర్థిగా మహ్మద్​ ఇంతియాజ్​ అహ్మద్​ ఒక సెట్​ నామినేషన్​ దాఖలు చేశారు.

మిగతా రెండు నియోజకవర్గాల నుంచి నామినేషన్లు వేయలేదు. నారాయణపేటలోని మక్తల్, నారాయణపేట అసెంబ్లీ సెగ్మెంట్లకు తొలి రోజు ఒక్క నామినేషన్​ కూడా దాఖలు కాలేదు. జోగులాంబ గద్వాల జిల్లాలో గద్వాల, అలంపూర్​ నియోజకవర్గాలు ఉండగా, అలంపూర్ ఎస్సీ నియోజకవర్గం నుంచి ప్రేమలత నామినేషన్​ పత్రాలను రిటర్నింగ్​ ఆఫీసర్​ చంద్రకళకు అందజేశారు. గద్వాల నియోజకవర్గానికి నామినేషన్లు రాలేదని రిటర్నింగ్  ఆఫీసర్​ అపూర్వ్ చౌహాన్ తెలిపారు. నాగర్​కర్నూల్​ జిల్లాలో 3 నామినేషన్లు దాఖలయ్యాయి.

బీఆర్ఎస్​ పార్టీ అభ్యర్థి,​కొల్లాపూర్​ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్​రెడ్డి తరపున ఆయన భార్య బీరం విజయ ఒక సెట్​ నామినేషన్​ దాఖలు చేశారు. నామినేషన్  పత్రాలను కొల్లాపూర్  రిటర్నింగ్  ఆఫీసర్​ కుమార్ దీపక్​కు అందజేశారు. నాగర్ కర్నూల్ నుంచి  సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి పార్టీ నుంచి కె.శంకర్​ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్  ఆఫీసర్​ వెంకట్ రెడ్డికి అందజేశారు. కల్వకుర్తి నుంచి బాదేపల్లి రాజు గౌడ్ ఇండిపెండెంట్​గా నామినేషన్ దాఖలు చేశారు.