పరకామణిలో విధులకు 60 మంది సిబ్బంది: TTD

పరకామణిలో విధులకు 60 మంది సిబ్బంది: TTD

పరకామణిలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. పరకామణిలో విధులకు 60 మంది సిబ్బందిని TTD కేటాయించింది. వారం రోజుల్లో నిల్వలన్నీ పూర్తిగా లెక్కించేలా ఏర్పాట్లు చేసింది. పరకామణి వ్యవహారాలను ఈవో సింఘాల్‌, జేఈవో శ్రీనివాసరాజు పర్యవేక్షిస్తున్నారు. వారం రోజుల పాటు పరకామణిలో అదనపు షిఫ్ట్‌ ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్ర 11 గంటల వరకు అదనపు సిబ్బందితో లెక్కించనున్నారు.