రామాలయ నిర్మాణానికి 60 వేల విరాళం

రామాలయ నిర్మాణానికి 60 వేల విరాళం

జన్నారం, వెలుగు: జన్నారం మండలంలోని రేండ్లగూడలో నిర్మిస్తున్న రామాలయానికి అదే గ్రామానికి చెందిన అల్లం నరేశ్ అనే వ్యక్తి రూ.60 వేల విరాళం అందజేశాడు. ఇందుకు సంబంధించిన చెక్కును శుక్రవారం గ్రామపెద్దలకు అందించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ నెమలికొండ ఆశారాజ్, గ్రామ పెద్దలు సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.