భూమిపై టాప్ 100 పొల్యూటెడ్ సిటీల్లో 63 ఇండియాలోనే

భూమిపై టాప్ 100 పొల్యూటెడ్ సిటీల్లో 63 ఇండియాలోనే

మన దేశంలో నగరాలన్నీ కాలుష్య  కోరల్లో చిక్కుకుని ఉన్నాయి. ఏ ఒక్క సిటీ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొన్న హెల్తీ ఎయిర్ క్వాలిటీ స్థాయి తగ్గట్టుగా లేదు. స్విస్ సంస్థ IQAir ప్రపంచ వ్యాప్తంగా సర్వే చేసి వెల్లడించిన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2021 లో ఇండియా పరిస్థితి అధ్వానంగా ఉంది. డబ్ల్యూహెచ్‌వో నిర్ధారించిన లెక్కల ప్రకారం పర్టిక్యులేట్ మ్యాటర్ పొల్యూటెంట్ PM2.5 గాలిలో సగటున 5 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ కు మించి ఉండడడం ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ ఇది మన దేశంలో 58.1గా (WHO సూచించిన దానికంటే పదింతలు ఎక్కువ) ఉందని ఐక్యూఎయిర్ సర్వేలో తేలింది. ప్రపంచంలోనే 100 అత్యంత కాలుష్యపూరిత నగరాల్లో 63 సిటీలు మనవే ఉన్నాయని తెలిపింది. అలాగే వరుసగా రెండో ఏడాది కూడా ప్రపంచంలో అత్యంత పొల్యూటెడ్ రాజధానిగా ఢిల్లీనే నిలిచిందని స్విస్ సంస్థ పేర్కొంది.

ఉత్తరాదిలోనే ఎక్కువ..

మన దేశంలో ఉత్తరాది సిటీల్లోనే పొల్యూషన్ ఎక్కువగా ఉంది. ప్రపంచం మొత్తంలో అత్యంత తీవ్రమైన కాలుష్యం ఉన్న సిటీల్లో టాప్ సిటీగా రాజస్థాన్ కు చెందిన భీవడి నిలించింది. రెండో స్థానంలో యూపీలోని ఘజియాబాద్ ఉండగా.. మూడో స్థానంలో చైనాకు చెందిన జింగ్ జియాంగ్ నగరం, నాలుగో స్థానంలో మన దేశ రాజధాని ఢిల్లీ, ఐదో స్థానంలో యూపీలోని జౌన్పూర్ ఉన్నాయి. ఇక టాప్ 15 పొల్యూటెడ్ నగరాల్లో పది మనవే ఉండడం గమనార్హం. మరోవైపు దేశంలో చెన్నై తప్ప అన్ని మెట్రో సిటీల్లో ముందటేడాదితో పోలిస్తే కాలుష్యం పెరిగిందని ఐక్యూఎయిర్ సంస్థ తెలిపింది. 

వాహన కాలుష్యమే ఎక్కువ

గాలి కాలుష్యానికి ప్రధాన కారణం వాహనాల నుంచి వచ్చే పొగేనని ఐక్యూఎయిర్ సంస్థ తెలిపింది. వాహన కాలుష్యం తర్వాత బొగ్గుతో నడిచే థర్మల్ పవర్ ప్లాంట్లు, పరిశ్రమలు, కట్టెల పొయ్యిలు, నిర్మాణ రంగం తర్వాతి స్థానాల్లో ఉన్నాయని పేర్కొంది.

మరిన్ని వార్తల కోసం..

ఎంసెట్ షెడ్యూల్ రిలీజ్

టార్గెట్ 2027: ఎమ్మెల్యేగా గెలుపు.. ఎంపీ పదవికి రాజీనామా

నేను ముత్యాల ముగ్గు హీరోయిన్.. రేవంత్ రెడ్డి విలన్