ఏపీలో కొత్త‌గా 657 క‌రోనా కేసులు.. 24 గంట‌ల్లో ఆరుగురు మృతి

ఏపీలో కొత్త‌గా 657 క‌రోనా కేసులు.. 24 గంట‌ల్లో ఆరుగురు మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు రోజూ భారీగా న‌మోద‌వుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో దాదాపు 28 వేల‌కు పైగా శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 657 మంది వైర‌స్ సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయింద‌ని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్ల‌డించింది. అందులో 611మంది లోక‌ల్స్ కాగా, ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చిన వారు 39 మంది, విదేశాల నుంచి తిరిగి వ‌చ్చిన‌వారు ఏడుగురు ఉన్నార‌ని చెప్పింది. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 9,18,429 టెస్టులు చేసిన‌ట్లు తెలిపింది. తాజాగా న‌మోదైన కేసుల‌తో క‌లిసి మొత్తం క‌రోనా బారిన‌ప‌డ్డ వారి సంఖ్య 15,252కి చేరింద‌ని వెల్ల‌డించింది. ఇందులో 12,813మంది లోక‌ల్స్ కాగా.. 2,439 మంది విదేశాలు, ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చిన వార‌ని రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 6,899 మంది క‌రోనా నుంచి పూర్తిగా కోలుకున్నార‌ని, 193 మంది ప్రాణాలు కోల్పోయార‌ని చెప్పింది. గ‌డిచిన 24 గంట‌ల్లో క‌ర్నూలు, కృష్ణా జిల్లాల్లో ముగ్గురు చొప్పున క‌రోనా వ‌ల్ల మ‌ర‌ణించారు. ప్ర‌స్తుతం 8,071 మంది వేర్వేరు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని తెలిపింది.

జిల్లా వారీగా క‌రోనా కేసుల వివ‌రాలు: