
ఏపీలో కొత్తగా మరో 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి ఇవాళ(బుధవారం) ఉదయం 9 గంటల వరకు 9159 మంది శాంపిల్స్ టెస్టు చేయగా 68 మందికి పాజిటివ్ వచ్చిందని హెల్త్ డిపార్ట్ మెంట్ బులెటిన్ రిలీజ్ చేసింది. ఇవాళ మరో 43 మంది కరోనా నుంచి కోలుకోగా కర్నూలులో ఒక్కరు మృతి చెందారు. దీంతో ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2407 కు చేరుకుంది. మొత్తం1639 మంది కోలుకున్నారు. 53 మంది చనిపోయారు. 715 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.