టార్గెట్ ఎవరు..? : కేరళలో 7 స్టీల్ బాంబులు వెలికితీత..

టార్గెట్ ఎవరు..? : కేరళలో 7 స్టీల్ బాంబులు వెలికితీత..

కేరళ పానూరు సమీపంలో  శనివారం ( ఏప్రిల్​ 6)  ఏడు స్టీల్​ బాంబులను పోలీసులు గుర్తించారు.  అయితే ఇదే ప్రాంతానికి సమీపంలో శుక్రవారం ( ఏప్రిల్​ 5)న బాంబు పేలిన ఘటనలో  ఒకరు మృతి చెందగా .. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.  దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు సోదాలను ముమ్మరం చేశారు.  బాంబు పేలుడు ఘటనపై  కూతుపరంబ ఏసీపీ కే. వేణు గోపాల్​  టీం విచారణ జరుపుతుంది.  ఈ ఘటనలో షెరిన్​ మరణించగా...అరుణ్, అతుల్​, శిబిన్​ లాల్​ అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్​ చేశారు.  ముఠాతో సంబంధం ఉన్న నయూజ్​ను కూడా అదుపులోకి తీసుకున్నారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

ఓ ఇంటి టెర్రస్​ పై  కొంతమంది బాంబులు తయారు చేస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.  ఈ ఘటనలో మృతి చెందిన షెరిన్​సీపీఎం కార్యకర్త అని పోలీసులు తెలిపారు.  రెండు చేతులు కోల్పోయిన వినీష్​ పరిస్థితి విషమంగా ఉండటంతో  కోజికోడ్​ లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు.  మరో ఇద్దరు అశ్వంత్, వినోద్ లకు స్వల్ప గాయాలయ్యాయి. నిందితులపై పానూరు పోలీసులు ఐపీసీలోని పేలుడు పదార్దాల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

ఈ ఘటనకు అధికార సీపీఐ (ఎం) కారణమని కేరళ  ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ ఆరోపించారు. వామపక్షాలు తమ కార్యకర్తలను ఉపయోగించి దేశంలోనే బాంబులు తయారు చేస్తున్నాయని, ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తున్నారని  ఆరోపించారు.