
హైదరాబాద్, వెలుగు: జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలకు, వివిధ కేటగిరీల్లో ఏడు అవార్డులు రావడం అభినందనీయమని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఇందులో ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి, తెలంగాణలోని పల్లె ఆప్యాయతను కళ్లకు కట్టినట్లు చూపిన బలగం సినిమాలోని పాటకు కాసర్ల శ్యామ్కు జాతీయ అవార్డు రావడంపై శుక్రవారం ఒక ప్రకటనలో మంత్రి వారికి అభినందనలు తెలిపారు.
బేబీ, హను మాన్ చిత్రాలకు రెండేసి అవార్డులు, గాంధీ తాత చెట్టు చిత్రానికి సుకృతి వేణి ఉత్తమ బాలనటిగా ఎంపికవడం తెలుగు సినీ పరిశ్రమ ప్రతిభను చాటిచెప్తున్నదని మంత్రి అన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొదటిసారి సినీ పరిశ్రమను తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులతో సత్కరించి, ప్రోత్సాహానికి శ్రీకారం చుట్టామని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినీ రంగాన్ని నిలిపేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.