
- 15 తులాల బంగారం రికవరీ
- నాలుగు వెహికల్స్స్వాధీనం
- పరారీలో మరో ఇద్దరు నిందితులు
- వివరాలు వెల్లడించిన సీపీ సాయిచైతన్య
నిజామాబాద్, వెలుగు: ఇందూర్ నగరంలో 24 ఇండ్ల తాళాలు పగులగొట్టడంతో పాటు హైదరాబాద్లో 15 ఆటో రిక్షాలను చోరీ చేసిన ముఠాను గుర్తించి ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. మంగళవారం తన ఆఫీస్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఆరో టౌన్ పరిధిలో తాళాలు వేసిన ఇండ్లల్లో వరుస చోరీలు జరగడంతో నిఘా పెట్టామన్నారు. సీసీ ఫుటేజీల ఆధారంగా హైదరాబాద్కు చెందిన మహ్మద్ ఆమెర్ను అదుపులోకి తీసుకున్నామన్నారు. చిన్నచిన్న చోరీలు చేసే ఇతడికి హైదరాబాద్కు చెందిన మరో వ్యక్తి మహ్మద్ అబ్దుల్ఆసీఫ్తో పరిచయం ఏర్పడిన తరువాత నిజామాబాద్ సిటీకి చెందిన ఎనిమిది మందిని కలుపుకొని ముఠాగా ఏర్పడ్డారన్నారు.
వారంతా కలిసి ఆరో టౌన్ పరిధిలోని 24 ఇండ్ల తాళాలు పగులగొట్టి చోరీలు చేశారన్నారు. చోరీ చేసిన ఆభరణాలను మల్కాపూర్ విలేజ్ గంజా కేసులు ఎదుర్కొంటున్న మోహన్ తక్కువ ధరకు కొనుగోలు చేయగా ఆ డబ్బును పది మంది పంచుకునేవారని తెలిపారు. హైదరాబాద్శివార్లోని షాపూర్, జీడిమెట్ల ఏరియాలో 15 ఆటో రిక్షాలు దొంగలించారన్నారు. మహ్మద్ఆమెర్తో పాటు మహ్మద్అబ్దుల్ఆసీఫ్ ఇందూర్కు చెందిన శేక్వసీమ్, సయ్యద్రియాజ్, జావెద్ఖాన్, శేక్సోయెల్, అహ్మద్ ఆసీఫ్, మాలోత్ మోహన్లను అరెస్ట్చేశామని తెలిపారు. వీరందరూ పలు కేసుల్లో ఇది వరకే జైలుకు వెళ్లి వచ్చారన్నారు. నిజామాబాద్కు చెందిన అలీబబ్లూ, సచిన్ పరారీలో ఉన్నారన్నారు. దొంగల ముఠా నుంచి 15 తులాల బంగారు ఆభరణాలు, నాలుగు వెహికల్స్స్వాధీనం చేసుకొన్నామని సీపీ పేర్కొన్నారు.