భారత్ లో కరోనా పంజా.. 90 వేలు దాటిన కరోనా మరణాలు

భారత్ లో కరోనా పంజా.. 90 వేలు దాటిన కరోనా మరణాలు

భారత్ లో కరోనా ఉదృతి కొనసాగుతుంది. గత 24 గంటల్లో 83,347 కొత్త కేసులు నమోదవ్వగా 1085 మంది మరణించారు. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 56,46,011 కు చేరగా..మరణాల సంఖ్య 90,020 కు చేరింది. నిన్న ఒక్కరోజే 89,746 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 45,87,614కు చేరింది.

ఇంకా 9,68,377 కు చేరింది. దేశంలో కరోనా రికవరీ రేటు 81.25. మరణాల రేటు 1.59 గాఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 9,53,683 మంది శాంపిల్స్ టెస్టు చేశారు. దీంతో దేశంలో సెప్టెంబర్ 22 నాటికి కరోనా టెస్టుల సంఖ్య 6,62,79,462 కు చేరిందని ఐసీఎంఆర్ ప్రకటించింది.

ఐపీఎల్.. అరుదైన టోర్నీ గా వరల్డ్ రికార్డు